పేదలకు ఉన్నత విద్యను దూరం చేసే జీవో నెంబర్ 77 ను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 22న సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ఏపీ టిఎన్ఎస్ఎఫ్ పిలుపునిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ .77 ను రద్దు చేయాలని కోరుతూ దశలవారీగా వివిధ ఉద్యమాలను టిఎన్ఎస్ఎఫ్ చేపట్టింది.
ప్రైవేట్, ఎయిడెడ్ పీజీ కళాశాలలో విద్యనభ్యసించే పేద, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ అగ్రవర్ణ పేదలకు ఉన్నత విద్యను దూరం చేసే విధంగా జీవో నెంబర్ 77 ఉందని టిఎన్ఎస్ఎఫ్ నాయకులు అన్నారు.
ఈ జీవోను రద్దు చేయకపోతే ఈ నెల 22న సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాలని ఏపీ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవి ప్రణవ్ గోపాల్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గం నుండి విద్యార్థులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని గుంటూరు జిల్లా నరసరావుపేట టియన్ యస్ఎఫ్ అద్యక్షుడు కూరపాటి హనుమంతరావు కోరారు.