రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు రహదారి భద్రతా ఉత్సవాలు జరుగుతున్నాయి. విజయనగరం జిల్లా అటు పోలీసు, ఇటు రవాణా శాఖ సంయుక్తంగా ఈ మాసోత్సవాలను నిర్వహిస్తున్నాయి.
ఇందులో భాగంగా జిల్లాలో అన్ని పోలీసు స్టేషన్ పరిధులలో సంబంధిత ఇన్ స్పెక్టర్లు తన స్టేషన్ సిబ్బంది, పాఠశాల విద్యార్ధులచే ఆయా పట్టణాలలో ర్యాలీ నిర్వహించారు.
ముఖ్యంగా విజయనగరం వన్ టౌన్ స్టేషన్ పరిధిలోని బాలాజీ జంక్షన్ రిలయన్స్ స్టోర్ వద్ద సీఐ మురళీ అవగాహన చేపట్టారు.
అదే విధంగా రామభద్రపురం,పార్వతీ పురం ,బొబ్బిలి, గజపతినగరం ,సాలూరు పోలీసు స్టేషన్ పరిధులలో పోలీసు సిబ్బంది, బ్రేక్ ఇన్ స్పెక్టర్లు సంయుక్తంగా 32వ రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహించారు.