విద్యార్థులలో ని బుద్ధికుశలతకు పదును చదరంగం పదును పెడుతుందని ప్రముఖ ఆర్యవైశ్య నాయకులు ఛాంర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దేసు శ్రీనివాస్ అన్నారు. గురువారం సాయంత్రం తెనాలి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చదరంగం శిక్షణాతరగతులన ప్రారంభిస్తూ తెనాలి పట్టణంలో ఆర్యవైశ్య అనబంథ సంస్ధలు పలు వైద్య , విద్య ఆరోగ్య సంక్షేమ పథకాలు చేపట్టటం హర్షణీయమని అన్నారు. ఈ రోజున చదరంగం ఆట ప్రపంచ ఆటలలో ప్రఖ్యాతి వహించిందన్నారు.
అనంతరం పట్టణ ఆర్యవైశ్య సంఘ అద్యక్షులు భాస్కరని శ్రీనివాసరావు మాట్లాడూతూ చదరంగం ఆటను ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ఆడుతున్నారని అంటూ చదరంగం ఆటలో మేధా శక్తి, విజ్ఞాన పరిజ్ఞానం, వ్యూహాత్మకత, కళానైపుణ్యం కలిసి మిళితమై ఉంటాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు K.రమేష్, అతర్జాతీయ స్టాయి ట్రైనర్ నిరంజన్ గురూప్రసాద్ శాయి మహిళా నాయకులు పాల్గొన్నారు.