ప్రస్తుత పరిస్థితులలో ప్రజల ప్రాణాలు కాపాడేది మాస్క్ లే కానీ పోలీసులు కాదని పశ్చిమగోదావరిజిల్లా దెందులూరు మండలం భీమడోలు సి ఐ సుబ్బారావు అన్నారు.
ప్రజల ప్రాణాలపై కోవిడ్ దాడి రోజు రోజుకు పెరుగుతుందని అన్నారు. ఇటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరు బాధ్యతగా మాస్క్ ధరించేలా చూడడం పోలీస్ విధులలో ఒక భాగమని దెందులూరు ఎస్ ఐ రామ్ కుమార్ తెలిపారు.
గురువారం మండల పరిధిలోని సోమవరపాడు గ్రామం లో ఎస్ ఐ రామ్ కుమార్ తో కలిసి భీమడోలు సి ఐ సుబ్బారావు మాస్క్ ధరించడం తప్పని సరి అని మాస్క్ పెట్టని వారిని గుర్తించి మాస్క్ ఆవశ్యకత వివరించి వారి తో వెంటనే మాస్క్ ధరింప జేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేశారు.