అరుణాచల్ప్రదేశ్లో కూడా చైనా నిర్మించిన రెండో గ్రామం శాటిలైట్ చిత్రాలు కూడా బయట పడ్డాయి. ఆ ప్రాంతంలో చైనా సుమారు 60 బిల్డింగ్ సముదాయాలను నిర్మించినట్లుగా ఆ చిత్రాల్లో స్పష్టంగా కనిస్తోంది. అరుణాచల్ప్రదేశ్లోని షియోమి జిల్లాలో ఈ ప్రాంతం ఉన్నట్టు డెట్రెస్ఫా తెలిపింది.
ఎల్ఏసీ , అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతం మధ్య ఉన్న భారత భూభాగంలో చైనా సెకండ్ ఎన్క్లేవ్ను నిర్మించినట్టు అక్కడి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇదిలావుంటే దొంగ చైనాకు గట్టి హెచ్చరిక చేశారు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్. భారత భూభాగం వైపు కన్నెత్తి చూస్తే అంతుచూస్తామని వార్నింగ్ ఇచ్చారు.
తాజాగా తూర్పు లద్దాఖ్లో ఆయన పర్యటించిన ఆయన చైనాకు స్ట్రాంగ్ వర్నింగ్ ఇవ్వడం పెద్ద సాహసంగా నిర్ణయించారు. 1962 భారత్ -చైనా యుద్దం జరిగిన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. రెజాంగ్లో యుద్ద స్మారకాన్ని ప్రారంభించారు.