చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ విదేశాలకు సైతం విస్తరిస్తు భయబ్రాంతులకు గురిచేస్తుంది.వైరస్ ప్రారంభమైన చైనాలోని ఉహాన్ నగరంలో వైద్య చికిత్సకోసం అదనంగా 450 మంది సైనిక డాక్టర్లను నియమించారు. చంద్రయాన్ నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించుకునేందుకు కూడా ఈ మహమ్మారి అడ్డుపడింది. ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.వైరస్ విస్తరించకుండా అదుపు చేసేందుకుగాను 18 నగరాలను దిగ్బంధం చేశారు.
కోట్లాదిమంది ప్రజలు ఎక్కడికీ వెళ్లడానికి వీలులేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.ఇంత వరకు 41 మంది చనిపోగా 1287మందికి వైరస్ సోకినట్లు ధృవీకరించారు. శుక్రవారం 830 ధృవీకరణ కేసులు నమోదు కాగా అవి 24 గంటల్లోనే 1287కు పెరిగాయి. ఎక్కువ మృతులు హుబేరు రాష్ట్రంలోనే సంభవించాయి. పెరుగుతున్న వైరస్ కేసులను పరిశీలించి చికిత్స చేసేందుకు కొత్తగా వేయిపడకల ఆసుపత్రిని ఉహాన్ నగర శివార్లలో నిర్మిస్తున్నారు.