చినజీయర్ స్వామి మేడారం వచ్చి ఇక్కడ జరుగుతున్న చెడు ఏమిటో నిరూపించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. సమ్మక్క, సారలమ్మలపై చినజీయర్ స్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే మేడారంలోని సమ్మక్క, సారలమ్మ గద్దెలను ఎమ్మెల్యే సీతక్క దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వనదేవతలైన సమ్మక్క, సారలమ్మల ప్రతిష్టను మసకబార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ముచ్చింతల్కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడకు రాలేకపోయారని విమర్శించారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మేడారానికి రాలేదన్నారు. వారి వైఖరేమిటో అర్థం కావడంలేదన్నారు. కోట్లాది మంది పూజించే దేవతలంటే ఎందుకింత చులకన? అని ప్రశ్నించారు. చినజీయర్ బేషరతుగా క్షమాపణ చెప్సాలని డిమాండ్ చేశారు.