విజయవాడ వేదికగా జరిగిన 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు వేదికపై విదేశీ బాలుడు తెలుగు గీతాలు అద్భుతంగా ఆలపించి అలరించాడు. తెలుగు భాష పై ఎక్కువతో ఈ చిన్నారి సంగీతంలో పట్టుసాధించిన పోలెండ్ దేశస్తుడైన బాలుడు బుజ్జి శాస్త్రీయ, జానపద, సినీ గేయాలన ఆలవోకగా మధురమైన గాత్రంతో ఆలపించి అందరితో శభాష్ అనిపించుకున్నాడు.
త్యాగరాజ కీర్తనలు, దేశభక్త గేయాలు, ఘంటసాల పాటల అద్భుతంగా ఆలపించిన బాలుడు బుజ్జి ని ఈ సభలలో హాజరైన అతిధులందరు ఆశీస్సులు అందించారు. ఈ సందర్బంగా మహానటి సావిత్రి కళాపీఠం ఈ వేదికపై మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ చేతులమీదుగా ఘనంగా సత్కరించింది. కళాపీఠం నిర్వాహకులు దారపు శ్రీనివాస్,సవరం వెంకటేశ్వరరావు, బడే ప్రభాకర్, సింహాద్రి కృష్ణప్రసాద్ శాలువాతో సన్మానించి మహానటి సావిత్రి కళాపీఠం జ్ఞాపికను బహుకరించారు.