సీఐడీ పోలీసులు జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా పని చేయవద్దని టీడీపీ పొలిట్ బ్యూరో టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనంద్ హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర ను నిన్న రాత్రి సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం అని ఆయన అన్నారు.
అన్యాయంగా సీఐడి పోలీసులు అరెస్టులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఐడీ అంటే గతంలో ప్రజలకు మంచి అభిప్రాయం ఉండేది. కానీ నేడు అ పరిస్థితి లేదు సీఐడి డిజి గా సునీల్ కుమార్ ఆయన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనంద పరిచే విధంగా సీఐడీ పోలీసులు వ్యవహరిస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు.
న్యాయస్థానాలు అంటే సీఐడీ పోలీసులకు గౌరవం లేదని నక్కా ఆనందబాబు తెలిపారు. కేవలం టీడీపీ వారిపై కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, టీడీపీ నాయకులపై వైసీపీ సోషల్ మీడియా వాళ్లు ఛండాలమైన పోస్టులు పెడితే పట్టించుకున్నారా అని ఈ సీఐడీ పోలీసులు అడుగుతున్నాం అని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ఎవరిని వదిలి పెట్టమని ఆయన హెచ్చరించారు. ఇంతకు ఇంత తగిన మూల్యం చెల్లిస్తామని మాజీ మంత్రి హెచ్చరించారు. సీఐడీ పోలీసులు కాదు మేము వస్తాం అని అంటే, చొక్కాలు తీసి రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయండి అని ఆయన అన్నారు.