కొల్లాపూర్ ఎక్సయిజ్ సర్కిల్ పరిధిలోని నాటు సారా స్థావరాలపై ఎక్సయిజ్ పోలీసులు నేడు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. గిరిజన తండాలలో కాస్తున్న నాటుసారాను పెద్ద ఎత్తున ధ్వంసం చేశారు. కొల్లాపూర్ స్టేషన్ అధికారి, నాగర్ కర్నూల్ డిటీఎఫ్ లు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడుల్లో మొత్తం 300 లీటర్ల ఎఫ్ జె వాష్ ను ధ్వంసం చేశారు. 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. కోడేర్ మండలంలోని గుండ్యా వాల్యనాయక్ తండా, సింగాయిపట్లి తాండాలలో ఈ దాడులు నిర్వహించినట్లు కొల్లాపూర్ సర్కిల్ ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు తెలిపారు. తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ ఐ శంకర్ రవి మమత, హెచ్ సి చెన్నా గౌడ్, పిసిలు దస్తగిరి, మహేష్, నార్య తదితరులు పాల్గొన్నారు.
previous post