నూతన మద్యం విధానంలో ఎలాంటి తప్పు లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సీబీఐ ముందు నిజాయతీగా అన్నీ వాస్తవాలే చెబుతానని తెలిపారు. మద్యం విధాన కుంభకోణంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆదివారం తమ ఎదుట హాజరుకావాలని శుక్రవారం సీబీఐ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. బయలుదేరడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ భాజపాపై నిప్పులు చెరిగారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వాన్ని ఉద్దేశించి.. వారు చాలా శక్తిమంతమైనవారని.. ఎవరినైనా జైలుకు పంపగలరని కేజ్రీవాల్ ఆరోపించారు. తనను అరెస్టు చేయాలని భాజపా నేతలు బలంగా డిమాండ్ చేస్తున్నారన్నారు. బహుశా సీబీఐ ని ఆ పార్టీ అలా ఆదేశించి ఉంటుందని వ్యాఖ్యానించారు.
previous post
next post