కరోనా మహమ్మారిపై ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో నిరవధికంగా జరుగుతున్న పోరాటానికి మద్దతుగా పిఎం కేర్స్ నిధికి విరాళాలు వస్తూనే ఉన్నాయి. కోవిడ్19 మహమ్మారికి వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం చేస్తున్న పోరాటాన్ని బలోపేతం చేస్తూ, సిఐఎస్ఎఫ్ డిజి, ఇతర అన్ని ర్యాంకులకు చెందిన సిబ్బంది వారి ఒక రోజు జీతాన్ని PM-CARES నిధికి అందించారు.
ఈ మొత్తం16కోట్ల రూపాయలు ఉంటుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. వారి నిస్వార్థ సేవకు దేశం రుణపడి ఉంటుందని ఆయన అన్నారు.