సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన సిఐటియు సీనియర్ నాయకుడు రైస్ మిల్ డ్రైవర్ కామ్రేడ్ ఉండేటి రాజారావు అనారోగ్యంతో సోమవారం మృతి చెందారని సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి తెలిపారు.
రాజారావు పార్ధివ దేహంపై సీఐటీయూ జెండా కప్పి పూల వేసిన అనంతరం రోషపతి మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం జరిగిన పోరాటంలో కీలక పాత్ర పోషించాడని, ఆయన లేని లోటు ఉందని అన్నారు.
కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. హుజూర్ నగర్ లో రాజారావు మృతికి సానుభూతిగా రైస్ మిల్లులు అన్ని బందు చేసి కార్మికులంతా అంత్యక్రియల్లో పాల్గొని పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో రైస్ మిల్ డ్రైవర్ల యూనియన్ అధ్యక్షుడు గుండెబోయిన వెంకన్న, రామయ్య, లాలయ్య రెడితి వెంకన్న, ఎలక సోమయ్యగౌడ్, ఐ ఎన్ టి యు సి నాయకులు సలిగంటి జానయ్య,
సైదులు, చింతకాయల మల్లయ్య, కోటేశ్వరరావు, పర్వతాలు, కనకయ్య, ఉపేందర్, అంజి, తిరుపతయ్య, రాజు, శ్రీను, రాములు, తదితరులు పాల్గొన్నారు.