37.2 C
Hyderabad
May 2, 2024 11: 51 AM
Slider ప్రకాశం

రక్తం కారేలా కొట్టుకున్న కరణం, ఆమంచి అనుచరులు

#Aamanchi Krishnamohan

ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం రామాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాల నాయకుల అనుచరులు రక్తం కారేలా కొట్టుకున్నారు. రామలింగయ్య స్థలంలో రాజారావుకు చెందిన కర్రలను తీయమనడంతో చిన్నగా గొడవ ప్రారంభమైంది.

చివరకు ఇది ఇరు వర్గాలు కొట్టుకునేంత వరకు వెళ్లింది. వాస్తవానికి వారం రోజుల నుంచే గ్రామంలో వాతావరణం వేడెక్కింది. గ్రామ కాపును ఎన్నుకునే విషయంలో ఇరు వర్గీయుల మధ్య వివాదం జరుగుతోంది. ఆ వివాదం కాస్తా… ఈరోజు మరో చిన్న కారణంతో కొట్టుకునేంత వరకు వెళ్లింది.

ఘర్షణ విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. ఈమధ్య టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీకి దగ్గరైన సంగతి తెలిసిందే. అయితే, వైసీపీ కండువాను ఆయన నేరుగా కప్పుకోకపోయినా… ఆయన కుమారుడు కరణం వెంకటేశ్ ను వైసీపీలో చేర్పించారు.

ఇది నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులకు ఏమాత్రం నచ్చలేదు. నేతలు ఇద్దరూ బాగానే ఉన్నప్పటికీ… వీరి అనుచరులు మాత్రం కలవలేకపోతున్నారు.

చీటికీమాటికీ గొడవపడుతున్నారు. వైసీపీ కార్యక్రమాలను కూడా ఎవరికి వారు నిర్వహించుకుంటున్నారు. తాజాగా రామపురంలో జరిగిన చిన్న గొడవ చివరకు ఉద్రిక్తంగా మారింది.

Related posts

కడప లో బయల్పడ్డ భూ గర్భ కారాగారం…

Satyam NEWS

నార్కో పరీక్షలను తిరస్కరించిన ఉమాశంకర్ రెడ్డి

Satyam NEWS

జనవరి 18 నుంచి మారుతున్న జగన్ జాతకం

Satyam NEWS

Leave a Comment