పెళ్లి అయిన రెండు నెలలకే ఒక మహిళ కన్నుమూసింది. విజయవాడ మొగల్రాజపురం సున్నం బట్టిల వద్ద ఈ ఘటన జరిగింది. గుంటూరు జిల్లా ఎర్రబాలెం కు చెందిన అంజన్ కృష్ణ, విజయవాడ రేణుకాకు అక్టోబర్ నెలలో వివాహం జరిగింది. విజయవాడ లో సెల్ ఫోన్ షాపులో అంజన్ కృష్ణ పని చేస్తుండేవాడు.
రెండు నెలల సక్రమంగా కాపురం చేసిన భర్త అంజన్ కృష్ణ ఆ తర్వాత తన అసలు రూపం బయటపెట్టాడని రేణుక కుటుంబ సభ్యులు అంటున్నారు. అంజన్ కృష్ణ మరో మహిళల తో వివాహేతర సంబంధం పెట్టుకోవడం తో భార్య రేణుక మందలించిందని కుటుంబ సభ్యులు అంటున్నారు.
మరో మహిళల తో వివాహేతర సంబంధం బయట పటడంతో తమ కుమార్తె ను అల్లుడు చిత్రహింసలకు గురిచేసేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య పై కోపంతో ప్రతి రోజు వేధింపులకు గురి చేసేవాడని అవేదన వ్యక్తం చేశారు. భార్యను అనేక మార్లు చనిపోవాలని తిట్టే వాడని… చివరకు చనిపోయేట్లు చేశాడని అల్లుడు పై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ బిడ్డ మరణానికి కారణమైన భర్త అంజన్ కృష్ణ ను కఠినంగా శిక్షించాని కన్నీరు మున్నీరుగా పిలపిస్తున్నారు. భర్త అంజన్ కృష్ణ పరార్ అయ్యాడు. భర్త అంజన్ కృష్ణ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.