27.7 C
Hyderabad
May 7, 2024 07: 31 AM
Slider వరంగల్

కాళోజి ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలి

#kaloji

అన్యాయాన్ని ఎదిరించిన ధిక్కారస్వరంగా, తెలుగు ప్రజల పక్షాన ప్రజాకవిగా నిలిచి చరిత్ర పుటల్లో నిలిచిపోయిన మహనీయులు  కాళోజి నారాయణ రావు అని తెలంగాణ సామాజిక రచయితల సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు కొండ్లే శ్రీనివాస్ అన్నారు. కాళోజి 107 వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ సామాజిక రచయితల సంఘం ఆధ్వర్యంలో కాళోజి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కాళోజి తన జీవితాన్ని త్యాగం చేసి దేశ ఘనకీర్తిని నలుదిశలా చాటిన మహోన్నత వ్యక్తిగా ప్రజల హృదయాల్లో నిలిచి పోయాడని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిక్కనూరి సుమన్, గాదె సుమన్, పోలుదాసరి రాము, సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు సంద బాబు పాల్గొన్నారు.

Related posts

కార్మిక దినోత్సవం మేడే విజయవంతం చేయాలి

Satyam NEWS

గొర్రెలు కాస్తున్న ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లు

Satyam NEWS

జాతీయ స్థాయిలో ఐసీఏఆర్ 14వ ర్యాంకు గ‌ర్వ‌కార‌ణం

Sub Editor

Leave a Comment