ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగుడా డివిజన్లో నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో హబ్సిగుడా లో క్రిస్మస్ సోదరులకు బట్టల పంపిణీ చేశారు. క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తమ సొంత నిధులతో క్రిస్మస్ కానుక లనుహబ్సిగుడా డివిజన్లోని పాస్టర్ లకు,సేవకులకు ఈరోజు హబ్సిగుడా స్ట్రీట్ నెంబర్ 1 లో పెనియేలు ప్రార్థన మందిరం చర్చి లొ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాస్టర్,స్టీఫెన్ ,రత్నకుమారి ,సుకన్య ,బిఆర్ఎస్ నాయకులు గంథం నాగేశ్వరావు,ఇంద్రసేన రెడ్డి , మధుసూదన్ రెడ్డి ,గ్యార ఉపేందర్ ,మనీష్ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా సత్యం న్యూస్