పైన దేవుడు ఉన్నాడు…చూస్తున్నాడు అని ప్రతీ సారి అంటున్న సీఎం జగన్ కు..దిగువన ఉన్న పేదోళ్లు కనిపించడం లేదా అని టీడీపీ ఉత్తరాంధ్ర పరిశీలకులు బుద్ధా వెంకన్న అన్నారు. టీడీపీ చేపట్టిన “భవిష్యత్ కు గ్యారెంటీ యాత్ర” లో భాగంగా విజయనగరం కొండవెలగాడ వద్ద సోనియా నగర్ లో టిట్కో ఇండ్ల పరిశీలనలో మాట్లాడారు.
టీడీపీ 4వేల ఇండ్లు మంజూరు చేస్తే..జగన్ ప్రభుత్వం వచ్చాక..అసలు ఇండ్లే నిర్మించలేదని అన్నారు. టీడీపీ ..పేదోన్ని గుర్తించి… లబ్ధిదారులకు యాభై వేలు మంజూరు చేస్తే..ఈ జగన్ ప్రభుత్వం… పైన దేవుడు ఉన్నాడు…చూస్తున్నాడంటూ…పేదవాడ్ని అతఃపాతాళంలోకి నెట్టెశాడని. .బుద్ధా వెంకన్న ఆరోపించారు.