28.7 C
Hyderabad
May 6, 2024 07: 46 AM
Slider వరంగల్

సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయండి

మునుగోడు ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో చండూరులో రేపు జ‌ర‌గ‌నున్న సీఎం కేసీఆర్ బహిరంగ స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. శ‌నివారం మంత్రి ఎర్రబెల్లి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, tsiidc చైర్మన్ బాల మల్లు, తదితరులతో కలిసి, హెలి ప్యాడ్ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడే మంత్రి కొద్దిసేపు మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ అనేక అద్భుత పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు, రెండు కళ్ళ లా చూస్తున్నారని, సీఎం కెసిఆర్ వల్లే రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి జరగడమే కాకుండా, అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. రైతు బంధు, రైతుబీమా, కేసీఆర్‌ కిట్‌, ఆసరా పింఛన్ల పథకం, కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి నిరుపేదలు, రైతుల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మునుగోడు గెలుపుకు బాటలు వేస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్ తోనే సాధ్యమ‌ని, అందుకే ఎక్క‌డికి వెళ్ళినా, ఎవ‌రిని క‌లిసిన టీఆర్ఎస్ కే మా ఓటు అని ఘంటా ప‌థంగా చెప్పుతున్నార‌ని వివ‌రించారు. వారి నుంచి వ‌స్తున్న పాజిటివ్ స్పంద‌న చూస్తే టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి గెలుపు ఖాయ‌మ‌ని, ఫ‌లితాలే త‌రువాయి అని స్ప‌ష్టం చేశారు.

సీఎం కేసీఆర్ స‌భ‌కు చండూరు మున్సిపాలిటీ తోపాటే, మునుగోడు నియోజకవర్గం మొత్తం నుండి ప్రజలు వేలాదిగా తరలివచ్చే విధంగా చూడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Related posts

గాంధీ జయంతి నాటికి శత శాతం అక్షరాస్యత సాధిద్దాం

Satyam NEWS

నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యుల అరెస్ట్

Satyam NEWS

రాజంపేటలో వికేంద్రీకరణకు మద్దతుగా క్యాండిల్ ర్యాలీ

Satyam NEWS

Leave a Comment