అధికార వికేంద్రీకరణకు మద్దతుగా రాజంపేట పట్టణంలో భారీ ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఆర్.బి బంగ్లా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన కొవ్వొత్తుల ర్యాలీ లో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. రాజంపేట పార్లమెంట్ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ శాసన సభ్యులు అకేపాటి అమర్ నాథ్ రెడ్డి, పార్టీ నాయకులు పోలా శ్రీనువాసులు రెడ్డి, చొప్ప యల్లారెడ్డి, తినాధ్, భాస్కర్ రాజు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా మూడు రాజధానులు ఏర్పాటు చేయడం హర్షణీయమని అకేపాటి అమర్ నాథ్ రెడ్డి అన్నారు. కర్నూలు ను న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయడం, అమరావతి ని శాసన రాజధానిగా ఏర్పాటు చేయడం సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖపట్నం లో ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని ఆయన అన్నారు. ఇలా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్ది కి మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహించినట్లు ఆయన తెలిపారు.