తెలంగాణ గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించారు. తెలంగాణలో కలకలం రేపుతున్న కరోనా విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేసీఆర్ గవర్నర్కు వివరించారు. అలాగే ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ను ఆహ్వానించారు.