38.2 C
Hyderabad
May 2, 2024 19: 32 PM
Slider నల్గొండ

రైతును రాజును చేసేందుకే రైతు వేదికల ఏర్పాటు

#MLA Lingaiah

రైతును రాజు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని నకిరేకల్ శాసనస భ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో 22 లక్షల రూపాయల వ్యయంతో రైతు వేదికకు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ అందుకే రైతుల కొరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని ఆయన అన్నారు.

అందులో భాగంగానే ప్రతి గ్రామంలో రైతు వేదికలను ఏర్పాటు చేసి గ్రామంలో రైతులందరూ ఒకచోట చేరి కాలానికి అనుగుణంగా ఏ పంట వేసుకోవాలో పండించిన పంటకు గిట్టుబాటు ధర నిర్ణయాల కోసం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నార్మల్ మథర్ డైయిరీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ జెడ్ పి టి సి సుంకర ధనమ్మ యాదగిరి గౌడ్ పాల్గొన్నారు.

ఇంకా వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు చిట్యాల సింగిల్విండో చైర్మన్ సుంకరి మల్లేష్ గౌడ్ వెలిమినేడు సింగిల్విండో చైర్మన్ రుద్రాపు బిక్షం గ్రామ సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్ రెడ్డి ఎం పి టి సి పెద్దబోయిన సత్తయ్య ఎలికట్టె ఎంపిటిసి దశరధ తాళ్ల వెల్లంల సర్పంచ్ జనగాం రవి ఎలికట్టె సర్పంచ్ ఉయ్యాల సత్తయ్య గౌడ్ మండల సమన్వయ సమితి కోఆర్డినేటర్ అద్దెల లింగారెడ్డి గ్రామ శాఖ అధ్యక్షుడు ఉయ్యాల నాగరాజు ఎలికట్టె గ్రామ శాఖ అధ్యక్షుడు నాగరాజు  మర్ల రామిరెడ్డి పాకాల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Related posts

Mind Game: టీడీపీ జనసేన పొత్తుపై కొత్త ప్రచారం

Satyam NEWS

పి వి నరసింహారావు ‘కాలాతీతుడు’ కవిమిత్రులకు ఘన సత్కారం

Satyam NEWS

జగన్ చేస్తున్న తప్పుల వల్లే చంద్రబాబుకు బ్రహ్మరథం

Satyam NEWS

Leave a Comment