బిఆర్ఎస్ పార్టీ ప్రధమ ప్రాధాన్యం మహిళలే అని ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభారాణి స్పష్టం చేశారు. శుక్రవారం చిలుకానగర్ డివిజన్ రాఘవేంద్ర నగర్ కాలనీలో జరిగిన వివాహ వేడుకల్లో ముఖ్య అతిథిలుగా ఆమె రావడంతో పెళ్లి వేడుకల్లో ఉన్న ప్రజలు ఆనందాన్ని వ్యక్తపరిచారు. పెళ్లి వేడుకల్లో సీఎం సతీమణి శోభ అందరిని ఆప్యాయంగా పలకరించడంతో పెళ్ళంట సంబరాలు అంబరాన్నంటాయి. వేడుకలకు హాజరైన శోభ ని చిలక నగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వేడుకల ఏర్పాట్లపై శోభ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పేదలకు అందే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు నిరుపేదలకు చేరుతున్నాయని ముఖ్యమంత్రి సతీమణి శోభ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ ని అడిగి తెలుసుకున్నారు. బిఆర్ఎస్ లో మహిళలే ప్రధానమని చెప్పినట్లు కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ తెలిపారు. నిన్నటి వరకు జరిగిన బిఆర్ఎస్ జాతీయ కార్యాలయం మరియు రాజశ్యామల యాగాలను ముఖ్యమంత్రి దంపతులు పాల్గొని వేడుకలను పూర్తిచేసుకుని హైదరాబాదుకు వచ్చి చిలకనగర్ లో జరిగిన పెళ్లి వేడుకలకు రావడం చాలా ఆనందంగా ఉందని కార్పొరేటర్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ తెలిపారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా