38.2 C
Hyderabad
May 3, 2024 19: 15 PM
Slider తెలంగాణ

రెగ్యులేషన్: నియంత్రిత సాగు విధానంపై 21న విస్తృత సమావేశం

#KCR Meeting

అవసరమైన పంటలు పండించే విధానాన్ని అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 21న మద్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో ఈ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. మంత్రులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతు సంఘం అధికారులను ఆ సమావేశానికి ఆహ్వానించారు.

వారితో ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా చర్చించి జిల్లాల వారీగా సాగు చేయాల్సిన పంటల సాగుపై చర్చిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. జిల్లాల వారీగా ఏ పంట ఎంత వేయాలి? వరిలో ఏ రకం విత్తనం ఎక్కడ ఎంత వేయాలి? అనే విషయాలను ఖరారు చేసేందుకు మంగళ, బుధవారాల్లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయాధికారులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు సమావేశాలు జరుపుతున్నారు.

ఈ సమావేశం అనంతరం జిల్లాల వారీగా పంటల మ్యాప్ ను రూపొందిస్తారు. ఆ పంటల మ్యాప్ పై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో చర్చించి, ఎక్కడ ఏ పంట వేయాలో నిర్ణయిస్తారు.

Related posts

మిస్టరీ: గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో యువతి బలి

Satyam NEWS

మళ్లీ తల్లి కాబోతున్న కరీనా కపూర్

Satyam NEWS

ప్రభుత్వ అస్పత్రులపై నమ్మకం పెంచాలి

Satyam NEWS

Leave a Comment