బిచ్కుంద మండల కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో పెద్దదేవాడ గ్రామానికి చెందిన విట్టల్ గొండకు జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే ముఖ్యమంత్రి సహాయ నిధి 2లక్షల చెక్కును శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎంపిపి అశోక్ పటేల్, తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి, దేవాడ సర్పంచ్ శివానంద్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు మల్లికార్జున్, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షులు జై శివరాజ్, ఉపసర్పంచ్ రాజు, రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షులు భద్రప్ప, నాయకులు సంజు కుమార్, శివరాజ్, బస్వరాజ్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.
previous post