ముఖ్యమంత్రి సహాయ నిధి ఎందరో పేదలకు వరంగా నిలిచిందని ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ అన్నారు. నిరుపేదలు అనారోగ్యం పాలైతే అప్పు చేసి వైద్యం చేయించుకోవాల్సి వచ్చేదని ఆమె అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదవారికి అలాంటి అవసరం లేకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైద్యానికి అవసరమైన మొత్తం చెల్లిస్తున్నారని ఎంపీపీ శ్రీదేవి తెలిపారు.
సిఎంఆర్ఎఫ్ నిరుపేదలకు ఆసరాగా నిలుస్తుంది అన్నారు. ఈ రోజు చింతలపల్లికి చెందిన శాంతమ్మకు సిఎంఆర్ఎఫ్ కింద మంజూరు అయిన 17,000 రూపాయల చెక్కును ఆమె అందచేశారు.
ఈ కార్యక్రమం లో పత్తిపెల్లి ఎంపీటీసీ నునవత్ మహేష్, మాజీ ఎంపిపి మురళి తదితరులు పాల్గొన్నారు.