రోడ్డు యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందిన ఒక వ్యక్తికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి పరిహారం అందింది. హైదరాబాద్ లోని నలకుంట డివిజన్ లోని తిలక్ నగర్ నివాసి వి.వేంకటేశం ఇటీవల యాక్సిడెంట్ కు గురయ్యారు. దాంతో ఆయనకు చెయ్యి విరిగిపోయింది.
నిరుపేద కుటుంబం కావడంతో ఆపరేషన్ కు డబ్బులు అవసరం కావడంతో రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి. హరీష్ రావుకు, స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కు విన్నవించుకున్నారు. దాంతో వారు రూ.60వేలు మంజూరు చేయించారు. నేడు స్థానిక టీఆర్ ఎస్ నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ వేంకటేశం కుటుంబ సభ్యులు చంద్రకళ ను కలిసి రూ 60,000/- చెక్కును అందచేశారు.