దళితులను ఏకం చేసి బిజెపిని పటిష్టం చేస్తానని రాష్ట్ర దళితమోర్చా కన్వీనర్ ఎస్.విజయ్ కుమార్ అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా ఇన్ఛార్జిగా నియమితులైన సందర్భంగా విజయ్ కుమార్ ను స్థానిక అంబెడ్కర్ భవన్ లో నారాయణ పేట జిల్లా బిజెపి అధ్యక్షుడు పగుడాకుల శ్రీనివాసులు, జిల్లా కోశాధికారి సిద్ది వెంకట్రాములు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు జి.రఘువీ ర్ యాదవ్,జిల్లా కోశాధికారి,సిద్ది వెంకట్రాములు, లీగల్ సెల్ కన్వీనర్ నందునామాజి, నాయకులు దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు లప్ప అశోక్ ఆశప్ప,కృష్ణ,భరత్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, నారాయణ పేట ప్రతినిధి