రిజర్వేషన్ల పెంపు కోసం BSP ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలం గోజెగావ్ గ్రామంలో జితేగా బహుజన్ 15 బూత్ లో భాగంగా మొదటి బూత్ కమిటీ బూత్ నంబర్ 6 ఈరోజు కమిటీ వేసి, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
బీసీ లకు 27% రిజర్వేషన్ నుండి 52 % రిజర్వేషన్ పెంచాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న BSP జిల్లా అధ్యక్షులు బట్టెంకి బాల్ రాజు, జిల్లా కోశాధికారి హరిలాల్ నాయక్, అసెంబ్లీ ఇంచార్జిలు ప్రజ్ఞాకుమార్,మల్లుపటేల్, అసెంబ్లీ అధ్యక్షులు ఇబత్ వార్ తుకారం, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి రోహిదాస్ డిమాండ్ చేశారు.
జి లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం