మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం కేంద్రంలోని ప్రసిద్ధి గాంచిన దక్షిణ ముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం రోజున అధికారుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. ఆలయానికి రికార్డు స్థాయిలో మూడు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై రెండు రూపాయలు హుండీ లెక్కింపులో వచ్చింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా స్టేట్ కమిషనర్ ఎన్ సుప్రియ, ఉమ్మడి జిల్లా ఇన్స్పెక్టర్ బి కమల ఎఇఓ పి శ్రీధర్ రికార్డ్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ రేణుక అలయ కమిటీ చైర్మన్ నర్సింలు గౌడ్ ఎంపీటీసీ విజయ్ అలయ కమిటీ సిబ్బంది గ్రామ పేదలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
previous post
next post