తమ భూమిని అధికారులు వేరే వాళ్ల పేర పట్టా జారీ చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ …. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల తహశీల్దార్ ఆఫీస్ గేట్కు తాళి కట్టిన ఘటన పై జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సీరియస్ అయ్యారు.
ఈ ఘటన పై విచారణ అధికారిగా సిరిసిల్ల ఆర్డీఓ శ్రీనివాస్ ను జిల్లా కలెక్టర్ నియమించారు. వెంటనే క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి వాస్తవ వివరాలతో సమగ్ర రిపోర్ట్ గురువారం సాయంత్రం లోగా అందజేయాలని ఆర్డీఓ శ్రీనివాస్ ను అదేశించారు.
జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆదేశాల తో ఆర్డీఓ శ్రీనివాస్ క్షేత్ర స్థాయిలో బాధితులు, అధికారుల తో మాట్లాడారు.
2018 లో పట్టామర్పిడి జరిగినట్లు ప్రాథమిక విచారణ లో గుర్తించారు. దాని పై క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారు.
గురువారం సాయంత్రం లోగా విచారణ జరిపి పూర్తి స్థాయి నివేదికను ఆర్డీఓ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సమర్పించ నున్నా రు. నివేదిక ఆధారంగా బాధ్యులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోనున్నారు.