కాలనీల్లో దుర్వాసన రాకుండా చేయాలని హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరిష్ అన్నారు. బుధవారం డివిజన్ లోని సాయిచిత్ర నగర్ లో బుధవారం విస్తృతంగా పర్యటించారు. సాయిచిత్రనగర్ వీధినంబర్ ఒకటి, రెండో నెంబర్ వీధిలో ప్రధానంగా విపరీతమైన దుర్వాసన వస్తోందని పైనుంచి వచ్చే కాలనీల డ్రైనేజి ఇక్కడ కలిపారని దానికి సరైన అవుట్ లైట్ లేక ఇక్కడ పేరుకుపోయి విపరీతమైన దుర్వాసన వస్తోందని కాలనీ వాసులు కార్పొరేటర్ కు తెలపగా కార్పొరేటర్ వెంటనే స్పందించి పెరుకుపోయిన చెత్త చెదారం తొలగించాలని దుర్వాసన రాకుండా చేయాలని ఇంజనీరింగ్ అధికారులు డియి. చందన, సాయిరెడ్డి లకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు బిజెపి సీనియర్ నాయకులు సంజయ్ పటేల్ న్యాలకొండ సుమన్ రావు తదితరులు పాల్గొన్నారు.
సత్యం మేడ్చల్ జిల్లా ప్రతినిధి