నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నివాసంలో మంగళవారం సందడి నెలకొంది. రూరల్ నియోజకవర్గ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, రూరల్ స్థానిక నేతలు వారి అనుచరులతో నివాసం నిండిపోయింది. పలువురు నేతలు తమ అనుచరులతో వచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డికి పుష్పగుచ్చాలు సమర్పించి శాలువాలతో సత్కరించారు. తమ శుభాకాంక్షలతో అభినందనలు తెలిపారు.
వైసిపి జిల్లా సమన్వయకర్త, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు అనంతరం ఒంగోలుకు కదిలి వెళ్లారు. రూరల్ కార్పొరేటర్లతో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆనం విజయకుమార్ రెడ్డి సమావేశమయ్యారు.
ఇటీవల కాలంలో కనిపించని పలువురు నేతలు దర్శనమిచ్చారు అంతకుముందు ఆదాల అనుచరులుగా ఉండి విడిపోయిన వారు కూడా తిరిగి రావడం విశేషం.