తిరుపతిలో ఒక విద్యార్ధి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగింది. చంద్రగిరి మండలంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఈ ఘటన జరిగింది. మృతుడు డిగ్రీ మొదటి సంవత్సరం విద్యనభ్యసిస్తున్న రవితేజ విద్యార్థి గా పోలీసులు గుర్తించారు. కళాశాల హాస్టల్ లోనున్న ఫ్యానుకు ఉరి వేసుకుని అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్ధిని అనంతపురం జిల్లా రాప్తాడు మండలం జయలక్ష్మిపురం పంచాయితీ కటిగాని కాలువ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చంద్రగిరి ఎస్.ఐ హిమబిందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.