మంగళవారం రాజస్థాన్లో భారత్, పాకిస్తాన్ సరిహద్దు దళాల మధ్య గ్రౌండ్ కమాండర్ స్థాయి సమావేశం జరిగింది. ఈ మేరకు బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి బుధవారం వెల్లడించారు. మంగళవారం రాష్ట్రంలోని బార్మర్ జిల్లాలోని మునబావోలో ఈ సమావేశం జరిగింది.
భారత పక్షానికి సరిహద్దు భద్రతా దళం (BSF) కమాండెంట్ GL మీనా నాయకత్వం వహించగా, మరొక వైపు పాకిస్తాన్ రేంజర్స్ వింగ్ కమాండర్ లెఫ్టినెంట్ కల్నల్ మురాద్ అలీ ఖాన్ నాయకత్వం వహించారు. సరిహద్దు భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి స్థానిక కమాండర్ (బెటాలియన్) స్థాయిలో ఇటువంటి సమావేశాలు జరుగుతాయని ప్రతినిధి చెప్పారు.
BSF దేశం పశ్చిమ భాగంలో జమ్మూ (జమ్మూ మరియు కాశ్మీర్), పంజాబ్, రాజస్థాన్ గుజరాత్ల లో 3,300-కిమీల పొడవైన ఇండో-పాకిస్తాన్ IBకి రక్షణగా ఉంది.