40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ చిన్నారెడ్డికి కాకుండా 40 రోజుల క్రితం పార్టీలో చేరిన వారికి వనపర్తి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం ఆ పార్టీ పతనాన్ని తెలియజేస్తుందని వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. నామినేషన్ అనంతరం రాజీవ్ చౌక్ లో భారీ జన సందేహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. నేను ఇచ్చిన ఎంపీపీ పదవితో కాంగ్రెస్ అభ్యర్థి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వనపర్తికి సురవరం ప్రతాపరెడ్డి వంటి గొప్పవారు ఎమ్మెల్యే అయ్యారని ఆ క్రమం కొనసాగుతుందని, ఇప్పుడు కొందరు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని విమర్శించారు. ప్రతి పేదవాడి ప్రయోజనం దృష్టితో నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానన్నారు. నన్ను ఓడించాలని కొందరు అంటున్నారని, నియోజకవర్గంలో 80,000 మందికి రైతుబంధు, ముఖ్యమంత్రి నియోజకవర్గం కంటే ఎక్కువగా సీఎం సహాయనిధి నిధులు, దశాబ్దాల ప్రజల కల పట్టణంలో రోడ్ల విస్తరణ, ప్రతి గ్రామానికి రోడ్లు తాగునీరు అభివృద్ధే లక్ష్యంగా పనిచేసినందుకు నన్ను ఓడించాలా అని ప్రశ్నించారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్