33.7 C
Hyderabad
April 28, 2024 23: 38 PM
Slider నల్గొండ

ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపుతోనే హుజూర్ నగర్ అభివృద్ధి

#uttam

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని 10వ,వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాచిమంచి గిరిబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు,కార్యకర్తలు,అభిమానులతో కలిసి బుధవారం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో 6 గ్యారంటీలను ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా బాచిమంచి గిరిబాబు,పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతూ 9 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని బిఆర్ఎస్ పార్టీ సన్నబియ్యం ఇస్తానంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు.కాంగ్రెస్ పార్టీ పాలనలో రేషన్ ద్వారా వంటనూనె, కందిపప్పు,గోధుమలు,పంచదార మున్నగు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన విషయం ప్రజలకు గుర్తు చేశారు.90 శాతం కాంగ్రెస్ పార్టీ కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలో పూర్తైన గృహాలను 9 సంవత్సరాలలో పంపిణీ చేయలేక పోయారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో కాకుండా అప్పులపాలు చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీదేనని,హుజూర్ నగర్ నియోజకవర్గం కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభ్యుడు గా,మంత్రిగా ఉన్నప్పుడు జరిన అభివృద్ధి తప్ప బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని అన్నారు.హుజూర్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే,ఇందిరమ్మ రాజ్యం రావాలంటే,ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి తోనే అభివృద్ధి సాధ్యమౌతుందని అన్నారు.

గడప గడపకు జరిగిన కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు,పార్టీ శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

కొత్తగా 1000 మత్స్య సహాకార సహకార సంఘాలు

Murali Krishna

పాఠశాలల విద్యపై ప్రభుత్వం దృష్టి సారించాలి

Satyam NEWS

మకర జ్యోతి కోసం వేచిఉన్న కోటి కన్నులు

Satyam NEWS

Leave a Comment