మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రిలోని పరిస్థితులను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బృందం నేడు సందర్శించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మూడు లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చిన సర్కార్ ఆసుపత్రుల సౌకర్యాలు, సిబ్బంది నియామకం, రోగుల అవసరమైన బెడ్లు సమకూర్చలేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.
ఫ్రంట్ లైన్ వారియర్స్, డాక్టర్లు, నర్సులకు గత ఐదు నెలల నుంచి జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రజల ప్రాణాలను ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆయన అన్నారు. అలాంటి వారికి ధైర్యం, భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ ఆస్పత్రుల సందర్శన యాత్ర చేపట్టిందన్నారు.