ప్రజా సేవలో కమ్యూనిస్టుల పాత్రను అధిగమించే రాజకీయ పార్టీలు తక్కువ అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు.
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో మంగళవారం నాడు జరిగిన సీపీఎం గ్రామ శాఖ మహా సభకు ఆయన ముఖ్య అథిదిగా హాజరై మాట్లాడారు.ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు చేస్తూనే సేవా కార్యక్రమాలు చేసేది కమ్యూనిస్టు లని అన్నారు.
చట్ట సభల్లో కమ్యూనిస్టు ల బలం తగినంత లేని కారణం గా పాలక పార్టీ లు ప్రజలపై ధరల భారాన్ని పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలోని సాగు నీటి కాల్వల ప్రాజెక్టు లకు నిధుల కేటాయింపు లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
మహా సభ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీ జంఢాను సీనియర్ నాయకులు బొంతల చంద్రారెడ్డి ఆవిష్కరించారు. నెలికంటి నర్సింహా అధ్యక్షుతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య,మండల నాయకులు శీలా రాజయ్య,అరూరి శ్రీను ,అరూరి శంభయ్య ,ఐతరాజు నర్సింహ ,రుద్రారపు పెద్దులు ,నాతి వెంకట్రామయ్య, మల్లం మహేష్ తదితరులు పాల్గొన్నారు.
పెద్ది నరేందర్, సత్యం న్యూస్, నకిరేకల్.