28.7 C
Hyderabad
April 28, 2024 07: 51 AM
Slider మహబూబ్ నగర్

అస్సాం ముఖ్యమంత్రిపై కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు

#kollapurpolice

కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ పై నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏ. రేవంత్ రెడ్డి, కొల్లాపూర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చింతలపల్లి జగదీశ్వర్ రావు ఆదేశాలు మేరకు ఈ ఫిర్యాదు అందచేశారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన  పదవుల తో ఎదిగి కాంగ్రెస్ పార్టీ ని మోసం చేసి బిజెపి పార్టీకి అమ్ముడుపోయిన బిశ్వశర్మ ఇప్పుడు ఆ పార్టీ మెప్పు కోసం రాహుల్ గాంధీపై అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారని వారన్నారు. దేశం దేశం మెచ్చిన నాయకుడు రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ కు లేదని వారు తెలిపారు. దేశం కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం అని వారన్నారు.

ఈ కార్యక్రమంలో  కొల్లాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్ యాదవ్, టి పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ జగదీశ్వరుడు, మండల అధ్యక్షులు పరశురాం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంగం శివానందం,  యూత్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ సోషల్ మీడియా పరమేష్ కొల్లాపూర్ మండల్ సేవాదళ్ ఏరాబాబు, నరసింహ పాల్గొన్నారు.

Related posts

ఇండోనేషియాతో భారత్ కు బలమైన బంధం ఉంది

Bhavani

మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుభాష్ కు సన్మానం

Satyam NEWS

కర్నూల్ రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ తనిఖీలు

Satyam NEWS

Leave a Comment