ప్రపంచం మనుగడ సాగిస్తుందంటే కార్మిక కర్షకుల కష్ట ఫలితమేనని, కష్టాన్నే నమ్ముకొనే కార్మికుల శ్రమను గౌరవిద్దామని ములుగు,భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు. ఆదివారం (మే డే ) ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం గ్రామంలో కామ్రేడ్ యం, డి సర్వర్ స్మారక స్థూపం వద్ద కార్మిక జెండాను ఆవిష్కరించారు.
అనంతరం తస్లీమా మాట్లాడుతూ చెమట చుక్కలను ధారబోస్తు శ్రమించే కార్మిక కర్షకుల శ్రమ వెలకట్టలేనిదని తస్లీమా అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కల్పన రూప్సింగ్, ఎంపిటిసి అమృత భాయ్, ఎంసిపీఐయు నాయకులు చంద్రయ్య,గ్రామస్థులు దొంతి రాంరెడ్డి,ప్రతాప్ రెడ్డి,బెతి రాజిరెడ్డి,సాయి రెడ్డి,కరివేద రాజిరెడ్డి,లక్ష్మారెడ్డి,ప్రమీల తదితరులు పాల్గొన్నారు.