37.2 C
Hyderabad
May 2, 2024 13: 20 PM
Slider విజయనగరం

సెరిమోనియల్ పరేడ్ లో భావోద్వేగానికి గురైన డీఐజీ రాజ‌కుమారీ….!

#rajakumari IPS

ఏపీ రాష్ట్రంలో దిశ  డీఐజీగా ప్ర‌స్తుత విజ‌య‌న‌గ‌రం ఎస్పీ రాజ‌కుమారీ బాధ్య‌త‌లు చేపట్టునున్నారు.ఈ సంద‌ర్బంగా ఆర్మ‌డ్ రిజ‌ర్వు పోలీస్ శాఖ  ఎస్పీ రాజ‌కుమారీకి సెరిమోనియల్ పరేడ్ నిర్వ‌హించింది.  156 మంది సిబ్బంందితో ప‌రేడ్ అధిప‌తి ఈశ్వ‌ర్ ఆధ్వ‌ర్యంలో ఏఆర్  నుంచీ రాజ‌కుమారీ గౌర‌వ వందనం స్వీక‌రించారు.

ఈసంద‌ర్బంగా డీఐజీగా వెళ్లనున్న ఎస్పీ రాజుకుమారీ కాస్త భావోద్వేగానికి గురై ప్ర‌సంగించారు. ఈ రండేళ్ల‌లో జిల్లా ప్ర‌జ‌ల‌కు నేను సేవ చేయ‌లేద‌ని మొత్తం శాఖ చేసింద‌ని చెబుతూ…క్ష‌ణం పాటు క‌ళ్ల వెంబ‌డి క‌న్నీళ్లు గొంతు లో భావోద్వేగం తో  కాస్సేపు ప్ర‌సంగిస్తూ ఎస్పీ ఆగిపోయారు.

అనంత‌రం పోలీస్ శాఖ చూస్తున్న జ‌ర్న‌లిస్టుల‌ను ప్ర‌త్యేకించి పిలిపించుకుని అంద‌రితో క‌లిసి ఫోటో దిగారు.అనంత‌రం మ‌హిళా కానిస్టేబుళ్లు..ప‌రేడ్  గ్రౌండ్ నుంచీ  డీపీఓకు  ప్ర‌యాణించిన ఎస్పీ వెహిక‌ల్ కు పూల స్వాగ‌తం క‌లికారు.

అడుగ‌డుగునూ పూల వ‌ర్షం కురిపించారు. ఊహించిన రీతిలో ఏఆర్ సిబ్బంది ప‌లికిన వీడ్కోలుకు ఆద్యంతం ఒకింత భావోద్వేగానికి లోన‌య్యారు.ఎస్పీ తో పాటు ఆమె భ‌ర్త బాల‌య్య‌, రాజ‌కుమారీ క‌న్న‌వాళ్లు ఈ ఏఆర్ వీడ్కోలు స‌భ‌లో పాల్గొన్నారు.

Related posts

ములుగు జిల్లాలో బాలల రక్షణ వారోత్సవాలు

Satyam NEWS

మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు

Satyam NEWS

ముఖ్యమంత్రి కెసిఆర్ కు పోస్ట్ కార్డులు పంపిన జర్నలిస్టులు

Bhavani

Leave a Comment