వనపర్తి జిల్లా పెబ్బేరులో విలేకరులపై దాడి చేసిన ఇసుక మాఫియాపై, నిర్లక్ష్యంగా ఉన్న పెబ్బేరు ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని వనపర్తిలో (నాజా) నాన్ అక్రీడేటెడ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి పిర్యాదు చేశారు. ఇసుక అక్రమ రవాణా చేసిన వారు విలేకరులను వెంబడించి కొట్టారని, ఇసుక గురించి రాస్తే చంపుతామని హెచ్చరిక చేశారని తెలిపారు. పెబ్బేరులో ఇసుక మాఫియాకు సహకరించిన పోలీస్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.కోటి రూపాయల విలువ గల ఇసుకను సిజ్ చేశారని తెలిపారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్