కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సమాన పనికి సమాన వేతనం, మినిమం టైం స్కేలు అమలు చేస్తామని,అర్హత ప్రమాణాలు ఆధారంగా వీలైంత ఎక్కువ మంది ఉద్యోగులును రెగ్యులర్ చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎన్ హెచ్ ఎం జేఏసీ చైర్మన్ డి దయామని డిమాండ్ చేశారు.
నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులందరూ పెద్దయెత్తున పోరాటం ఫలితంగా నాడు గత ఏడాది ఆగస్టు 16న వైద్యారోగ్యశాఖ ఉన్నతస్థాయి అధికారులు NHM ఉద్యోగుల ప్రతినిధులతో చర్చల్లో ఒప్పందం మేరకు G.O.No. 60 ప్రకారం వేతనాలు పెంచుతూ ఆదేశాలు ఇవ్వటం, 9రోజుల వ్యవధిలో వేతనాలు తగ్గిస్తూ G.O. NO. 64 ఉత్తర్వులు ఇచ్చి నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ ఉన్నతస్థాయి అధికారులు మోసం చేయటం అన్యాయమన్నారు.
దీనిపై ఉద్యోగులందరూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, 19.6.2023 నుండి వివిధ రూపాల్లో నిరసన తెలియచేస్తున్న నేటికీ అధికారులు స్పందించకపోవడం ఉద్యోగుల్ని మరింత ఆందోళన కు గురిచేస్తుందన్నారు. 10న సామూహికంగా జగనన్నకు చెబుదాం చలో తాడేపల్లి కార్యక్రమాన్ని ఉద్యోగులు పెద్దయెత్తున పాల్గొని విజయవంతం చేయాలని, నేరుగా ముఖ్యమంత్రి కలుగజేసుకొని NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్ తక్షణమే పరిష్కరించాలని AP NHM JAC ఛైర్మెన్ డి.ధయామణి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని కోరారు.
AP NHM JAC ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద NHM ఉద్యోగులు బ్లాక్ బడ్జెస్ ధరించి వారి న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని, మొదటిగా ప్రకటించిన G.O No 60ప్రకారం వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ లు స్వర్ణ, కుసుమ, దీవెన, వెంకటరమణ, సుమాదిపిక, ఉపేంద్ర,2nd ANM లు జ్యోతి రేణుక, రాజేశ్వరి, పద్మావతి, చిట్టితల్లి తదితరులు పాల్గొన్నారు.