పిల్లలు పెరుగుదల వారు తీసుకునే సమతుల ఆహారం పైనే ఆధారపడి ఉంటుందని మహిళ శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆర్ జె డి కె.ఝాన్సీ అన్నారు.
ఆమె నేడు ములుగు జిల్లా జంగాలపల్లి 3 వ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణమాసం కార్యక్రమముకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి డిడబ్ల్యూఓ ప్రేమలత, సీడీపీఓ లక్ష్మీ, డీపీఎం చౌహన్ కూడా హాజరయ్యారు. చైల్డ్ లైన్, సఖి, ఐసీపీస్ కార్యాలయాలను కూడా ఝాన్సీ సందర్శించారు.