ఎన్నికల విధుల నుంచి సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ని తప్పించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ ఆదేశించారు.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్కు లేఖ రాశారు. ప్రవీణ్ ప్రకాశ్ తాము ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశ్యవూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని ఆయన తెలిపారు.
కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఆయన ఇక నుంచి సమీక్షించకుండా ఆదేశాలివ్వాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి సకాలంలో చర్యలు తీసుకోవడంలో ప్రవీణ్ ప్రకాశ్ విఫలమయ్యారని ఎస్ఈసీ తెలిపారు.
ఈ నెల 23న కలెక్టర్లు, ఎస్పీలతో జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్ జరపకుండా చేశారని, జీఏడీకి అధిపతిగా ఉన్న ప్రవీణ్ తన ఆదేశాలను పట్టించుకోలేదని లేఖలో పేర్కొన్నారు.
అధికారులను సన్నద్ధం చేయడంలో విఫలమయ్యారని, అందుకే ఎన్నికల షెడ్యూల్ను వాయిదా వేయాల్సి వచ్చిందని ఎస్ఈసీ తెలిపారు.