సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల కేంద్రంలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులను హుజుర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంఎల్ఏ సైదిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో నిర్మిస్తున్న రైతువేదిక పనులను వేగవంతం చేయాలని, సాధ్యమైనంత త్వరగా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ZPTC జగన్ నాయక్, మఠంపల్లి పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ కొండానాయక్, TRS నాయకులు గుండా బ్రహ్మారెడ్డి, నేరేడుచెర్ల వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్మినారాయణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.