38.2 C
Hyderabad
April 28, 2024 20: 43 PM
Slider నల్గొండ

ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం

#bachimanchigiribabu

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మున్సిపాలిటీ లోని 10వ, వార్డులో బుధవారం కాంగ్రెస్ పార్టీ నేతలు,కార్యకర్తలు,అభిమానులు ఇంటింటికి విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బాచిమంచి గిరిబాబు,పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తరువాత బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమి లేదని,కెజి నుండి పిజి విద్య,నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఊసే లేకుండా పోయిందని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన మాట ఏమైందని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న ఊసే లేకుండా పోయిందని,2014 నుండి నేటివరకు ఒక్క క్రొత్త రేషన్ ఇవ్వకుండా ఇప్పుడు సన్న బియ్యం ఇస్తానంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని,అధికారంలోకి రాగానే కార్మిక, కర్షక,రైతులను,నిరుద్యోగులను అందుకోవటమే కాక నిరుపేదలకు ఇందిరమ్మ పక్కా గృహాలు ఇస్తుందని, కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టిన 6 గ్యారెంటీలు తూచా తప్పకుండా అమలు చేస్తుందని,హస్తం మన నేస్తం మని, హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించి హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి,తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి క్రొత్త బాటలు వేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,పార్టీ శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

ఎటు గాలి కొడితే అటు ఎగురుతున్న టీఆర్ఎస్ జెండా

Satyam NEWS

పనిష్ మెంట్: ఆకతాయిలపై పోలీసు కొరడా

Satyam NEWS

టియుడబ్ల్యూజేతోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం

Satyam NEWS

Leave a Comment