ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ పరిధిలో సభ్యత్వ నమోదు కసరత్తు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని ఏ బ్లాక్ అధ్యక్షుడు మందుముల పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ ఆదేశాల మేరకు డివిజన్ల వారీగా డివిజన్ కు ఒక ఇన్చార్జిని నియమించినట్లు పేర్కొన్నారు. నాచారం డివిజన్ కు బోరంపేట కృష్ణ ముదిరాజ్, చిలుకానగర్ డివిజన్ దర్శనం వినోద్ కుమార్, హబ్సిగూడ డివిజన్ ఎంఏ జలీల్ పాషా, రామంతాపూర్ డివిజన్ చెన్ రెడ్డి రఘుపతి రెడ్డి, ఉప్పల్ డివిజన్మ హ్మద్ తౌఫిక్ లను ఇన్చార్జిలుగా నియమించినట్టు ఉప్పల్ నియోజకవర్గం ఏ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మంద మూల పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి