కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే మూలె సుధీర్ రెడ్డి కి కరోనా పాజిటివ్ వచ్చింది. జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, మీడియా వారికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షల లో జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
దీంతో సుధీర్ రెడ్డి హోమ్ ఐసోలేషన్ కు వెళ్ళారు. 15 రోజులపాటు తనను కలవడానికి ఎవరూ రావద్దని ఎమ్మెల్యే కోరారు.